మానవుని జీవితంలో ప్రధానంగా మూడు దశలు ఉంటాయి. తొలిదశలో విద్యాభ్యాసం చేస్తాడు. తను నేర్చుకున్న దాన్ని పాటిస్తూ రెండవ దశలో భార్యా పిల్లలతో గడుపుతాడు. మూడవ దశలో భగవంతుని ఆరాధిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటాడు. ఈ మూడు దశలకు సంబంధించిన దిశానిర్దేశం తో మూడు శతకాలు వ్రాశారు భర్తృహరి. నీతి ,శృంగార ,వైరాగ్య శతకాలు మూడు మనిషికి జీవితాన్ని నైతికవిలువలను నేర్పిస్తాయి. ఉన్నతమైన జీవన విధానానికి మార్గదర్శకం చేస్తాయి. అంతటి విలువైన విషయాలను సరళమైన తెలుగులో శతావధాని ఆముదాల మురళి గారు మనకు అందించారు. భర్తృహరి వ్రాసిన సంస్కృత శ్లోకాల తో పాటు ఏనుగు లక్ష్మణ కవి వ్రాసిన తెలుగు పద్యాలు ఈ పుస్తకంలో చేర్చారు. అందువల్ల ఈ పుస్తకం విలువ మరింత పెరిగింది.